Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం. ​​సింహాచలంలో ఘనంగా మూడవ రోజు యోగాభ్యాసం.

.                     K.V.SHARMA  EDITOR 
 సింహాచలం, జూన్ 9, 2026:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, శ్రీ శ్రీ శ్రీ వరాహ 


లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా శిక్షణ కార్యక్రమం మంగళవారం మూడవ రోజుకు చేరుకుంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు పర్యవేక్షణలో కొండపై జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉద్యోగులు, అర్చకులు  ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.


యోగా శిక్షకుల మార్గదర్శకత్వంలో పాల్గొన్న వారంతా వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలను అభ్యసించారు. శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం నిత్యం యోగా సాధన చేయాలని 


ఈ సందర్భంగా అధికారులు సూచించారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈఓ పిలుపునిచ్చారు.

​కార్యనిర్వహణాధికారి,

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం.

Comments