Skip to main content

క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఒలింపిక్ డే రన్: జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ అధ్యక్షులు మెట్ల రమణబాబు

.            SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు మెట్ల రమణబాబు  క్రీడాజ్యోతిని ప్రజ్వలింప చేసి జెండా ఊపి ఒలింపిక్ డే రన్ ను ప్రారంభించారు.


 ఈ రన్ లో 300 మంది ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, పీడీలు, పీఈటీలు & క్రీడా అభిమానులు పాల్గొని ఆఫీసస్ క్లబ్ నుండి గడియార స్తంభం మీదుగా అమలాపురం పురవీధుల్లో ఈ రన్ ను నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ ఒలింపిక్ డే రన్ దోహదపడుతుందని రమణ బాబు అన్నారు. అనంతరం పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ మరియు  టీ షర్ట్స్ ను, టిఫిన్, బిస్కెట్స్ - ఫ్రూటీలను అందజేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లాడ శరత్ బాబు, సెక్రెటరీ పప్పుల శ్రీరామ్ మూర్తి, ఉపాధ్యక్షులు గోకర్కొండ నాగేంద్ర, ట్రెజరర్ కల్వకొలను భుజంగవాని బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు, ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ తిక్కిరెడ్డి సీనా బాబు , కట్ట పురుషోత్తం, భీమరాజు, వై ఎస్ వి రమణారావు, గొలకోటి నారాయణరావు, ఐ. భీమేష్, బిఎస్ఎన్ మూర్తి,  చంటి, తిక్కిరెడ్డి సురేష్, పి. విగ్నేశ్వరుడు, కే, వెంకటేశ్వరరావు, జి, శ్రీదేవి, నాగ దుర్గ, కే.గణేష్, వి.బుజ్జి, గొల్ల కోటి శ్రీనివాస్, పి. ప్రసాద్,తోట రవి, కె.రవి సుధీర్  తదితరులు పాల్గొన్నారు.

Comments