Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. స్వామివారిని దర్శించుకున్న మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు

.                      K.V.SHARMA EDITOR 
 సింహాచలం: జూన్ 14, 2026. :శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం మాడుగుల గౌరవ శాసనసభ్యులు బండారుసత్యనారాయణమూర్తి, చోడవరం గౌరవ శాసనసభ్యులు శ్రీ కె.ఎస్.ఎన్. రాజు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షణ అధికారి కె. వెంకటేశ్వరరావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం చేసుకుని, సంప్రదాయబద్ధంగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు.

తదుపరి వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేయగా, దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, ప్రసాదాలు అందజేశారు.

Comments