రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ శ్రీ మహమ్మద్ ఇమ్రాన్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలనే ఉద్దేశంతో డీఎస్సీ–2026 పరీక్షల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటిస్తూ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, పేద విద్యార్థుల ఉన్నత విద్య వంటి అంశాలు రాజకీయాలకు అతీతమైనవని, ఇవి లక్షలాది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామకాల్లో అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ యువతకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ–2026 పరీక్షల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెలువడినా ప్రభుత్వం వాటిపై స్పష్టత ఇవ్వకుండా మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ఒకే వ్యవస్థ పరిధిలో ఉంచడం, ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను భాగస్వామ్యం చేయడం, పరీక్షల నిర్వహణలో పనిచేసిన వ్యక్తికే అత్యున్నత ర్యాంకు వచ్చిందనే ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి వివరాలు మెరిట్ జాబితా నుంచి తొలగించబడటం, సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలవకపోవడం, మెరిట్ జాబితాల్లో మార్పులు జరిగాయనే ఆరోపణలు, సర్టిఫికెట్లు ధృవీకరించబడినా కొందరికి నియామకాలు ఇవ్వకపోవడం, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలు, జీవో నంబర్లు 4, 47, 56 ద్వారా నిబంధనల్లో జరిగిన మార్పులు వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. టీచర్ పోస్టుల కోసం అక్రమ బేరసారాలు జరిగాయనే వీడియోలు వెలుగులోకి వచ్చినప్పటికీ అసలు సూత్రధారులపై చర్యలు తీసుకోకుండా నామమాత్రపు కేసులతో సరిపెట్టడం వెనుక కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి తప్పులు జరగలేదని చెబుతున్నట్లయితే వెంటనే సీబీఐ విచారణకు అంగీకరించాలని, లేకపోతే కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా కొట్టిపారేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వైద్య విద్యలో ప్రవేశం కోసం విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమవుతారని, ఒక్క ప్రశ్నపత్రం లీకేజీ వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి పరీక్షా కేంద్రాల వరకు ప్రతి దశలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అన్ని బకాయిలను విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిగే వరకు, విద్యార్థుల హక్కులు పరిరక్షించబడే వరకు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల పోరాటం నిరంతరం కొనసాగుతుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ సమావేశం లో జిల్లా యువజన విభాగం అధ్యక్షులువురుకుతి రామ చంద్ర రావు (చందు) , రాష్ట్ర విద్యార్ధి విభాగం కార్యనిర్వాహక అద్యక్షులు ద్రోణం రాజు శ్రీవాత్సవ , జోనల్ యువజన్ విభాగమ అద్యక్షులు అంబటి శైలష్ , జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఖండవలి రోహిత్ , నియోజకవర్గం అద్యక్షులు రవి కిరణ్ రెడ్డి , రౌత్ శ్రీను తదితరాలు పాల్గొన్నారు.

Comments
Post a Comment