జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 27.07.2026
ఈరోజు అనగా తేదీ 27.07.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి ఆదేశానుసారం డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి సమావేశ మందిరంలో ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యం వారితో గిరి ప్రదిక్షణ నిమిత్తం మెడికల్ క్యాంపులు, అంబులన్స్లు, ఏర్పాట్లు గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 32 మెడికల్ క్యాంపులు, 26 అంబులన్స్ లు (22 ప్రైవేటు హాస్పటల్ అంబులన్స్ లు, 4 ప్రభుత్వం వారి 108 అంబులన్స్ లు) ను 18 మాపింగ్ చేసిన పాయింట్స్ లో పెట్టడం జరిగిందని తెలియచేసారు.
ముఖ్య ప్రదేశాలైనటువంటి తోలి పావంచ, హనుమంతవాక, లుంబిని పార్క్, పాత గోశాల, ఆర్.హెచ్.సి.సింహాచలం, దేవస్థానం కొండ ఎగువ వంటి ప్రాంతాలలో 14 ప్రత్యెక అంబులన్స్ లు పెట్టడం జరిగింది. 32 మెడికల్ క్యాంపులు 28 వ తేది. ఉదయం 07:00 గంటల నుండి 29 వ తేది. రాత్రి 08:00 గంటల వరకు జరుగును అని తెలియచేసారు. ప్రైవేటు హాస్పిటల్స్ వారందరూ వారికీ కేటాయించిన మెడికల్ క్యాంపుల నందు కేటాయించిన సమయానికి ఒక గంట ముందుగానే సంబందిత వైద్యాధికారి వారికీ రిపోర్టింగ్ చేయాలనీ తెలియచేసారు.
ఈ సమావేశంలో డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ వారు, శ్రీ బి. నాగేశ్వర రావు డెమో వారు, డా.కె.అప్పారావు, ఎన్టీఆర్ వైద్య సేవ కో-ఆర్డినేటర్ వారు, ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యం పాల్గొన్నారు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం


Comments
Post a Comment