Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, సింహాచలం. సింహాచలం, 29 జూలై 2026: ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో శతాబ్దాల నాటి సాంప్రదాయ చారిత్రక ఘట్టం 'ఢిల్లీవిజయోత్సవం' నేడు అత్యంత వైభవంగా జరిగింది.

.                  K.V.SHARMA EDITOR 
వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ధిల్లీ విజయోత్సవం ఉత్సవాన్ని నేడు భక్తిశ్రద్ధలతో, ఆగమశాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు.

ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ వెంకట్రావు ఆధ్వర్యంలో, స్థానాచార్యులు డాక్టర్ డి.పి. రాజగోపాల్  ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ విశిష్ట ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

స్థానాచార్యులు డా. డి.పి. రాజగోపాలాచార్యులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో ముస్లిం దండయాత్రల కాలంలో భక్తుల రక్షణార్థం శ్రీ స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ గర్భగుడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించి భద్రపరిచారు. అనంతరంపరిస్థితులుఅనుకూలించడంతో ఉత్సవమూర్తిని తిరిగి ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించిన సందర్భాన్ని స్మరించుకుంటూ ఈ ధిల్లీ విజయోత్సవాన్ని ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.

చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ.శ. 1017–1137 మధ్యకాలంలో జరిగిన పరిణామాలకు గుర్తుగా ఈ ఉత్సవం కొనసాగుతుందని, అనంతర కాలంలో ఉత్సవమూర్తిని తిరిగి ఆలయంలో ప్రతిష్ఠించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఆచారం ప్రారంభమై నేటికీ కొనసాగుతోందని తెలిపారు. సుమారు 1961 నుంచి ఈ ఉత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు  ఆధ్వర్యంలో, స్థానాచార్యులు డా. డి.పి. రాజగోపాలాచార్యులు గారి పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు, శ్రీ సీతారామాచార్యులు, ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, నాదస్వర మంగళవాద్యాల మధ్య ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది.

ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షణాధికారి కె వెంకటేశ్వరావు పర్యవేక్షణలో అన్ని సౌకర్యాలను దేవస్థానం అధికారులు, సిబ్బంది సమకూర్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు, దేవస్థానం సిబ్బంది పాల్గొనగా,  భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...