Skip to main content

మెగా పేరెంట్స్‌ అండ్‌ టీచర్స్‌ 4.0లో పాల్గొన్న ఏపీజెడబ్ల్యూఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్‌


గాజువాక: గాజువాక నియోజకవర్గం 68వ వార్డు మింది గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్‌ అండ్‌ టీచర్స్‌ 4.0 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (APWJF) విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్‌ అతిథిగా పాల్గొన్నారు. 68వ వార్డు టీడీపీ సీనియర్‌ నాయకులు ఈటి. శ్రీనివాసరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల స్టాళ్లను సందర్శించి వాటి వివరాలను తెలుసుకున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశమై హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జి. శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, కృషి, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువు, ప్రవర్తన, ప్రతిభను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని ప్రోత్సహించాలని కోరారు.

“పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలి” అని జి. శ్రీనివాస్‌ విద్యార్థులకు సూచించారు.


68వ వార్డు టీడీపీ సీనియర్‌ నాయకులు ఈటి. శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల 89 శాతం ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. గత ఏడాది 570గా ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 580కి పెరగడం శుభ పరిణామమని అన్నారు. మెగా పేరెంట్స్‌ అండ్‌ టీచర్స్‌ మీటింగ్‌ విద్యారంగంలో చేపడుతున్న ప్రధాన సంస్కరణల్లో ఒక భాగమని పేర్కొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వి.ఎస్‌. ఆంజనేయ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరని అన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. లీప్‌ యాప్‌ ద్వారా విద్యార్థుల చదువు, ఫలితాలు, అభ్యసన పురోగతిని తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు ప్రత్యేక బాధ్యత తీసుకుని, పిల్లల భవిష్యత్తు కోసం తగిన సమయం కేటాయించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి.వి.ఎస్‌. ఆంజనేయ, పి.ఏ.వి. రమణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. అనంతలక్ష్మి, ఉపాధ్యాయులు డి. సత్యనారాయణ, వీ. రమేష్‌, నర్సింగరావు, నిరూపమ, పరదేశి, గ్రామ పెద్దలు వరీ వెంకట్రావు, సిగటాపు గుర్నాథ్‌, మంగరాజు, నర్సింగరావు, లక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...