Skip to main content

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం. ఈ రోజు సాయంకాలం 7 గంటల నుండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు కొండ చుట్టూ విస్తృతంగా పర్యవేక్షణ నిర్వహించారు.

 

                     K.V.SHARMA EDITOR 
ఈ రోజు సాయంకాలం 7 గంటల నుండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు కొండ చుట్టూ విస్తృతంగా పర్యవేక్షణ నిర్వహించారు.

ఈ పర్యవేక్షణలో భాగంగా కొండ చుట్టూ ఏర్పాటు చేసిన సేవా కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌లోని డిప్యూటేషన్ సిబ్బంది హాజరు పరిస్థితిను పరిశీలించారు. సేవా కేంద్రాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని కూడా సమీక్షించారు.

అదేవిధంగా అప్పు ఘర్ ప్రాంతంలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి టి. అన్నపూర్ణ  పర్యవేక్షణలో భక్తులు సముద్రంలోకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన జల్లు (బారికేడింగ్) ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల భద్రత దృష్ట్యా తీసుకున్న చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా అనే విషయాన్ని ఇఓ సమీక్షించారు.

తదుపరి కొండ చుట్టూ ఉన్న అన్ని సేవా కేంద్రాలను సందర్శించి, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ పర్యవేక్షణ కార్యక్రమం ద్వారా భక్తుల భద్రత, సౌకర్యాల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...