Skip to main content

నేడు మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం వర్ధంతి*

. Dr  Nanduri Ramakrishna Sr Sub EDITOR 
 2015 జూలై 27న షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లో విద్యార్థులను ఉద్దేశించి  ఉపన్యాసం ఇస్తుండగా హటాత్తుగా గుండెపోటు రావటంతో ఆయన అక్కడకక్కడే తుదిశ్వాస విడిచారు.

అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త, 1960లో DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) లో శాస్త్రవేత్తగా చేరారు.

తదుపరి 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరిన కలాం ముఖ్యంగా మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) అభివృద్ధిలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. 

అగ్ని, పృథ్వీ, ఆకాశ్ క్షిపణులతో సహా భారతదేశ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో కలాం కీలక పాత్ర పోషించారు. ఈ రంగంలో ఆయన చేసిన కృషికి గాను ఆయనను "భారతదేశ క్షిపణి మనిషి (Missile Man of India") గా పేర్కొంటారు.

1998లో భారతదేశ అణ్వస్త్ర సామర్థ్యాలను ప్రదర్శించిన పోఖ్రాన్-II అణు పరీక్షలలో కలాం కీలక పాత్ర పోషించారు. 

విజన్ 2020లో   భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు.

అబ్దుల్ కలాం 2002 నుండి 2007 వరకు భారత దేశ పదకొండవ రాష్ట్రపతి గా సేవలందించారు. 

ఆయన 'ప్రజల రాష్ట్రపతి'గా పేరు పొందారు.1997 లో భారతదేశపు అత్యున్నత పౌర భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను ఆయన అందుకున్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...