Skip to main content

ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ.....

.                 SRINIVAS SPL Correspondant 
 అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం గోడిలంక గ్రామంలోని భవిత సెంటర్ నందు మండల విద్యాశాఖ అధికారి ఎస్ ఏడుకొండలు  అధ్యక్షతన ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 37 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపకరణాలతో కూడిన కిట్టును అందించారు. 


మండల విద్యాశాఖ అధికారి కే కిరణ్ బాబు  మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకతను, మనో అభివృద్ధికి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని మరియు అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మరియు నడవలేని పిల్లలకు వీల్ చైర్స్, సిపి కంబోర్డ్ చైర్స్, చూపు లేని పిల్లలకు స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ తో కూడిన స్మార్ట్ ఫోన్, వినికిడి లోపం గల విద్యార్థులకు హియరింగ్ మిషన్ అందించారు.


 భవిత పాఠశాల ఉపాధ్యాయులు టి. శ్రీను  మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ప్రత్యేక ఎన్రోల్మెంటల్ ప్రక్రియ జరుగుతుందని మండల ఆవాస ప్రాంతాలలో విద్యార్థులtలో ఇంకానే ప్రభుత్వ పాఠశాలలో నమోదు కాకపోతే వెంటనే నమోదు చేయాలని తద్వారాi ప్రభుత్వాలు అందించే ఈ ఉచిత ఉపకరణాలు మరియు ప్రత్యేక అలవెన్సులు అందుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల ఉపాధ్యాయులు ఏ భవాని, ప్రైమరీ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యులు పి. మంజుల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments