Skip to main content

వేడుకగా శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణం !!

 

                   K.V.SHARMA EDITOR 
విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తలు:టౌన్ కొత్త రోడ్డు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానంలో రథయాత్ర మహోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీ జగన్నాథ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని శ్రీ వైఖానస అగమ సంప్రదాయంలో అర్చక బృందం లక్ష్మీ స్వరూపిణిగా సుభద్రా దేవి వారి శాంతి  కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు . ఆలయ ఈవో టి రాజ గోపాల్ రెడ్డి సారధ్యంలో కళ్యాణోత్సవం నిర్వహించగా ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు . విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదములు అందజేశారు .

Comments