విశాఖపట్నం డివిజనల్ రైల్వే పీఆర్ఓ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్ రైల్వే పి ఆర్ ఓ ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా రైల్వే శాఖలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. రైల్వే పి ఆర్ ఓ ప్రసాద్ జర్నలిస్టులతో ఆప్యాయంగా మాట్లాడి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియా పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు

Comments
Post a Comment