Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, సింహాచలం. పౌర్ణమి సందర్భంగా భక్తులకు నిత్య అన్నప్రసాదం వడ్డించిన ఈవో దంపతులు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి – పాలు, మజ్జిగ, బిస్కెట్ల పంపిణీ.

 

                    K.V.SHARMA EDITOR 
సింహాచలం, 29 జూలై 2026:పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు గారి ఆదేశాల మేరకు భక్తులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేసి సేవలు అందించారు. భక్తుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.


అనంతరం  శ్రీ స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రంలో కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు దంపతులు స్వయంగా భక్తులకు ప్రసాదంగా స్వీటు కదంబం దద్దోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.

 ఈ సందర్భంగా భక్తులు ఈవో దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసి, దేవస్థానం చేపడుతున్న సేవలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో అన్నదానం సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ వాడ్రేవు రమణమూర్తి, పర్యవేక్షణాధికారి శ్రీ నర్సింగరావు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...