Skip to main content

శేష పాన్పు పై లక్ష్మి నారాయణులగా దర్శనమిచ్చిన జగన్నాథుడు!

 

                     K.V.SHARMA EDITOR 
జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలలో భాగంగా శనివారం తొలి ఏకాదశి పర్వదినం నాడు స్వామి వారు శేష పాన్పు పై కొలువుదీరి భక్తులందరికీ దర్శనమిచ్చారు. తొలి ఏకాదశి పైగా శనివారం వలన భక్తులు ఉదయం నుండే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆంధ్ర ప్రదేశ్ హోమ్ శాఖా మాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం, పాయకరావుపేట తరపున జగన్నాథ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. 


వారికి పూర్తి మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, బురుజుపేట నుంచి ఈఓ ఎన్ సుజాత గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం 1500 మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ సీతంరాజు సుధాకర్ గారు స్వామి వారిని దర్శించుకున్నారు. 

రేపు ఉదయం 9:00 గంటలకు బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారిని రథం మీద వేంచేసి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం 4:20 గంటలకు దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారిచే తిరుగు రథయాత్ర ప్రారంభవుతుంది.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...