Skip to main content

అడ్వాన్స్‌డ్ నూక్లియ‌ర్ రీసెర్చ్ లేబ‌రేట‌రీ ప్రారంభం


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం,జూలై 27:ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం అణుభౌతిక శాస్త్ర విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి జ్ఞానానంద అడ్వాన్స్‌డ్ నూక్లియ‌ర్ రీసెర్చ్ లేబ‌రేట‌రీని సోమ‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖర్ అతిధుల‌తో క‌లిసి లాబ‌రేట‌రీని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా వీసీ ఆచార్య రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ నూత‌నంగా అభివృద్ది చేసిన లాబ‌రేట‌రీ విద్యార్థుల‌కు ప్ర‌త్య‌క్ష శిక్ష‌ణ‌, నైపుణ్యాల‌ను అందించే వేదిక‌గా నిలుస్తుంద‌న్నారు. విభాగ వ్య‌వ‌స్థాప‌కులు స్వామి జ్ఞానానంద‌, ఇత‌ర ఆచార్యులు స‌మాజ ఉప‌యుక్తంగా ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రిపార‌న్నారు. విభాగాన్ని మ‌రింత‌ బ‌లోపేతం చేసే విధంగా మ‌రిన్ని నూత‌న ప్ర‌యోగ ఉప‌క‌ర‌ణాల‌ను తీసుకువ‌స్తామ‌న్నారు. విద్యార్థుల‌కు ఇంట‌ర్న్‌షిప్ సైతం అందించే విధంగా స‌హ‌కారం అందించ‌డానికి ముందుకువ‌చ్చిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 


విభాగాధిప‌తి ఆచార్య పి.వి ల‌క్ష్మి నారాయ‌ణ మాట్లాడుతూ ప‌ర్యార‌వ‌ణంలో ఉన్న రేడియో ధార్మిక‌త‌ను గుర్తించ‌డానికి ఈ లాబ‌రేట‌రీ ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంద‌న్నారు. విద్యార్థుల‌కు ప్ర‌త్య‌క్ష శిక్ష‌ణ అందించ‌డం వ‌ల‌న వారు కోర్సు పూర్తిచేసే స‌మ‌యానికి విభిన్న ప్ర‌యోగ‌శాల‌లో ప‌నిచేయ‌డానికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు ల‌భిస్తాయ‌న్నారు. నీరు, గాలి, నేలలో ఉన్న రేడియో ధార్మిక‌త స్థాయిల‌ను గుర్తించే అవ‌కాశం ఉంద‌న్నారు. ఆల్ఫా రే, బీటా రే, గామా రే స్పెక్ట్రోమీట‌ర్‌లు, రాడాన్ స‌ర్వే మీట‌ర్ అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు.


కార్య‌క్ర‌మంలో మోడ‌ర‌న్ టెస్ట్ సెంట‌ర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌(బ‌ర్హంపూర్) రాజేంద్ర మిశ్ర‌, బార్క్ విశ్రాంత శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ డి.విద్య సాగ‌ర్‌,  రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు , సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏం.వి.ఆర్.రాజు, విభాగ ఆచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా విభాగం వ‌ద్ద‌నున్న స్వామి జ్ఞానానంద విగ్ర‌హానికి పూల‌మాల‌వు వేసి అంజ‌లి ఘ‌టించారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...