Skip to main content

ప్రతి ఓటరుకు సరైన సేవఅందించటం"సర్"కార్యక్రమం ప్రధాన లక్ష్యం: జిల్లా అధ్యక్షులు కొత్తూరి శ్రీనివాస్... ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు...

.           SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం శాసనసభ నియోజక వర్గం, అమలాపురం మున్సిపల్ 2వ. వార్డు నందు సర్  ప్రోగ్రాంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు  ఒంటెద్దు బాబి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.   బిఎల్ ఓ  మరియు బి ఎల్ ఎ  లతో కలిసి ఓటర్లను సర్ కార్యక్రమం  యొక్క విధివిధానాలను తెలియజేశారు. ఎలక్షన్ కమిషన్ ఈ ప్రోగ్రామును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించినందుకు కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు  కొత్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఓటరుకు సరైన సేవ అందించటం" సర్ "కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఓటర్లకు అందిస్తున్న సేవలను మరియు వారి యొక్క సమస్యల పరిష్కారము, దరఖాస్తులు స్వీకరణ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలోని పాల్గొని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఎస్ సి  సెల్ అధ్యక్షులు  వడ్డీ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు  మాచవరపు శివన్నారాయణ, అమలాపురం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  ఏలేశ్వరం రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మహబూబ్ షకీలా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments