డాక్యుమెంట్ రైటర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలు నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలూ పొందవచ్చని
డాక్యుమెంట్ రైటర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలు నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిఅన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలూ పొందవచ్చని ద్వారకానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ డి.వి.నారాయణ, సూపర్ బజార్ రిజిస్ట్రార్ ఆఫీసు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ -1 జె.కనకరత్నం, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ -2 కె.రామశ్రీను తెలిపారు. శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవల విషయంలో ఎటువంటి అంతరాయం, లోపం లేదన్నారు. ప్రజలకు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవల విషయంలో సిబ్బంది అన్ని విధాలా సహకరిస్తారని చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవల్లో ఇబ్బందులు ఉంటే తమను నేరుగా సంప్రదించవచ్చవచ్చని తెలిపారు. గత కొన్ని రోజులుగా అనేక మంది నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి సేవలు పొందుతున్నారని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చి సేవలు పొందాలని కోరారు

Comments
Post a Comment