Skip to main content

సింహాచలం గిరి ప్రదక్షిణ భక్తులకు వివేకానంద సంస్థ మరియు రౌండ్ టేబుల్ సంస్థ వారు టాటా గ్లూకోజ్, వాటర్ బాటిల్స్, ప్రసాదాలు పంపిణీ....


వివేకానంద సంస్థ మరియు రౌండ్ టేబుల్ సంస్థ మరియు సభ్యుల సహకారంతో, కైలాసగిరి సమీపంలో సింహాచలం గిరి ప్రదక్షణ భక్తులకు టాటా గ్లూకోజులు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు కొ ల్లపూడి .భరత్ , తండ్రి కొ ల్లపూడి .ప్రభాకర్ పేరుమీద విరాళాన్ని అందించారు. ప్రతి సంవత్సరం కూడా వివేకానంద సంస్థ వారు  సింహాచల గిరి ప్రదక్షిణ భక్తులకు మజ్జిగ ,ప్రసాదాలు అందిస్తూ నారాయణ సేవలో పాల్గొంటున్నారు. 


సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి పవిత్ర యాత్ర పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు పొందాలని, స్వామివారి ఆశీస్సులతో ఈ నారాయణ సేవలో పాల్గొంటున్నందుకు సంస్థవారు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని


 ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సంస్థ మాజీ చైర్మన్ మక్సుద్ గారికి, రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు భరత్ గారికి సంస్థ అధ్యక్షులు అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులుP. నల్ల రాజు,ch. ఎల్లాజీ, గజపతి స్వామి, గురు స్వామి, గురుమూర్తి, వాసుపల్లి. కోదండ రావు, పద్మావతి దంపతులు పాల్గొని వారి సేవలను అందించారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...