Skip to main content

శ్రీ రామునిగా దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి!!

.                    K.V.SHARMA Editor 
 టర్నర్ సత్రం లో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలలో భాగంగా గురువారం నాడు జగన్నాథ స్వామి శ్రీ రాముని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని పశ్చిమ నియోజక వర్గం MLA శ్రీ గణ బాబు గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 


అనంతరం శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం, రామతీర్థం సహాయ కమిషనర్ మరియు ఈఓ వై.శ్రీనివాసరావు దంపతులురామతీర్థం దేవస్థానం నుండి స్వామివారికి  పట్టు వస్త్రాలను సమర్పించారు. వారికి ప్రధాన ఉత్సవ అధికారి టి అన్నపూర్ణ, 


ఈఓ టి రాజ గోపాల్ రెడ్డి, ధర్మ కర్తల మండలి చైర్మన్ ఎస్ రాజ్ కుమార్ మరియు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మధ్యాహ్నం 1000 భక్తులకు అన్న ప్రసాద వితరణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి

Comments