హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ , దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్రమంతా అనేక ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ వస్తున్నది.
అందులో భాగంగా 02-08-2026 ఆదివారం నాడు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామివారి వ్రతాలు ఇసుక కొండ శ్రీరమా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం 8 గంటలకు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే ఉచిత రీతిన సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములను నిర్వహించనున్నామన్నారు . స్థలాభావం వల్ల 125 జంటలను మాత్రమే ప్రవేశం కల్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు .
పాల్గొనదలచిన వారు ఆగస్టు 1 వ తేదీ లోపుగా నేరుగా ఆలయ సిబ్బందిని సంప్రదించి మీ పేరు గోత్ర నామాలను నమోదు చేసుకోని టోకెన్లు తీసుకోవాలని సూచించారు .
ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకే భక్తులు ఆలయమునకు విచ్చేయాలనీ 8:30 నిమిషాలకు వ్రతము ప్రారంభించబడతాయన్నారు.
ఈ వ్రతములో పాల్గొనదలచిన భక్తులు 2 కొబ్బరికాయలు, 6 అరటి పండ్లు ,విడి పువ్వులు మాత్రమే తీసుకునిరావాలనీ, మిగతా పూజా సామాగ్రి అంతా ఉచితంగా ఇవ్వబడుతుందని తెలియ జేసారు.
ఈ సందర్భంగా , ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలకు సంబంధించిన గోడపత్రికను దేవాదాయ శాఖ HDPT ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ జి ఆర్ కే ప్రసాద్ (రాంబాబు) , ఆలయ ఈవో శ్రీ టి రాజగోపాల రెడ్డి, ధర్మ కర్తల మండలి చైర్మన్ శ్రీ కే. సూర్యప్రసాద్, HDPT సభ్యులు శ్రీ M.V.రాజశేఖర్ శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆవిష్కరించారు .
ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ జి ఆర్ కే ప్రసాద్ (రాంబాబు)మాట్లాడుతూ ఆరోజు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ శ్రీ దాసరి శ్రీనివాసులు IAS(R) పాల్గొంటారని తెలిపారు .
ఆలయ అర్చకులు పి నరసింహ ఆచార్యులు శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో వ్రతాలను నిర్వహిస్తారని కనుక భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, సాంప్రదాయ దుస్తుల్లోనే వచ్చి సామూహిక వ్రతాల్లో పాల్గొని కోరికలు తీర్చే శ్రీ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు .
టి రాజ గోపాల్ రెడ్డి
కార్య నిర్వహణాధికారి

Comments
Post a Comment