Skip to main content

న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.... ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ( ఐ ఎల్ ఏ ) డిమాండ్.

.             SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని కోరుతూ గురువారం అమలాపురం బార్ అసోసియేషన్ ప్రాంగణంలో న్యాయవాదులు నినదించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి. 


పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మంజూరు చేయాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాశి శేషారావు మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు నెలకు పదివేలు చొప్పున స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు దాకారపు చిరంజీవి మాట్లాడుతూ అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. అనంతరం న్యాయవాదులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 


న్యాయవాదులు డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తానని కలెక్టర్ మహేష్ కుమార్ న్యాయవాదులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సురేష్ కుమార్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నల్ల ప్రభాకర్ రావు, ఐ ఎల్ ఏ జిల్లా నాయకులు పియల సత్యనారాయణ, పినిపే వెంకట సత్యనారాయణ, కుంచే శ్రీనివాసరావు, సోమరాజు, భాస్కర్ జోసెఫ్, గుర్రాల రాంబాబు, రోహిణి, డి రాణి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...