Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్ భరత్

.                  K.V.SHARMA EDITOR 
 సింహాచలం, జూలై 19: విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్ తేజ్ భరత్ ఆదివారం కుటుంబ సమేతంగా శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు 


ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ తేజ్ భరత్ మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలతో పాటు జ్ఞాపికగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు

Comments