K.V.SHARMA EDITOR
ఆంధ్రవిశ్వవిద్యాలయం, జూలై 10:ఆంధ్రవిశ్వవిద్యాలయం మహారాణిపేట మహిళా వసతి గృహంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఆచార్య ఆశాలత తెలిపారు. దోమలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. అదే విధంగా ఫాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
ముందస్తుగా విద్యార్థినులకు వైద్య పరీక్షలు సైతం చేయించామన్నారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది సహకారంతో హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతోందన్నారు.
Prof. Ashalatha
Ph: 8074947012


Comments
Post a Comment