దివ్యాంగుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వ ముందుంటుంది: ఎంపీ గంటి హరీష్ మాధుర్ దివ్యాంగులకు త్రీ వీలర్ స్కూటర్స్ పంపిణీ.... లైసెన్సుల కోసం నేరుగా సంప్రదించండి: డిటిఒ శ్రీనివాస్......
. SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందించిందని అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 10 చొప్పున జిల్లాలో 70 త్రి చక్ర వాహనాలను పంపిణీ చేసిందని పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ తెలిపారు.
ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇతర అర్హతలను పరిశీలించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు.
మాట్లాడుతూ దివ్యాంగుల స్వయం సమర్థత, ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున సుమారు 1,800 మోటరైజ్డ్ ద్విచక్ర స్కూటీలను పంపిణీ చేసిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు 10 చొప్పున మొత్తం 70 మంది దివ్యాంగులకు ఒక్కోటి సుమారు రూ.1.20 లక్షల విలువైన మోటరైజ్డ్ స్కూటీలను ఉచితంగా అందజేశామన్నారు. దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం తదితర రంగాల్లో స్వయం సమర్థులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టడం, టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపుకు ప్రాధాన్యం ఇవ్వడం, స్వయం ఉపాధి కోసం రుణాల కల్పన, రాష్ట్రవ్యాప్తంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు సభ్యులు, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్, రామచంద్రపురం మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కలిసి విభిన్న ప్రతిభావంతుల మోటార్ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల మోటార్ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ స్కూటీలు దివ్యాంగుల చలనశీలతను పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతివారికి లైసెన్స్ తప్పనిసరి లైసెన్స్ కొరకు ఎలా అప్లై చేసినప్పుడు తమను దివ్యాంగులు సంప్రదించి సులభతరం చేసుకోవాలన్నారు. ఎస్. కె ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకరాలు ఎస్. కె సూర్యకళ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు సుమారు 50 మందితో అద్దె భవనంలో హోమ్ నిర్వహిస్తున్నానని స్థలం కేటాయించాలని ఎంపీ హరీష్ ను కోరగా అధికారులు చర్చించి నిర్ణయం తెలియజేస్తానని అన్నారు. కార్యక్రమానికి వచ్చిన వికలాంగులకు భోజనాలను ఎస్. కె ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు అందజేశారు.
అమలాపురం, విశాఖ సందేసం....తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందించిందని అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 10 చొప్పున జిల్లాలో 70 త్రి చక్ర వాహనాలను పంపిణీ చేసిందని పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ తెలిపారు.
ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇతర అర్హతలను పరిశీలించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు.
కార్యక్రమంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గుడిపూడి నారాయణస్వామి
మాట్లాడుతూ దివ్యాంగుల స్వయం సమర్థత, ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున సుమారు 1,800 మోటరైజ్డ్ ద్విచక్ర స్కూటీలను పంపిణీ చేసిందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు 10 చొప్పున మొత్తం 70 మంది దివ్యాంగులకు ఒక్కోటి సుమారు రూ.1.20 లక్షల విలువైన మోటరైజ్డ్ స్కూటీలను ఉచితంగా అందజేశామన్నారు. దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం తదితర రంగాల్లో స్వయం సమర్థులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టడం, టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపుకు ప్రాధాన్యం ఇవ్వడం, స్వయం ఉపాధి కోసం రుణాల కల్పన, రాష్ట్రవ్యాప్తంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటు సభ్యులు, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్, రామచంద్రపురం మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కలిసి విభిన్న ప్రతిభావంతుల మోటార్ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల మోటార్ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ స్కూటీలు దివ్యాంగుల చలనశీలతను పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతివారికి లైసెన్స్ తప్పనిసరి లైసెన్స్ కొరకు ఎలా అప్లై చేసినప్పుడు తమను దివ్యాంగులు సంప్రదించి సులభతరం చేసుకోవాలన్నారు. ఎస్. కె ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకరాలు ఎస్. కె సూర్యకళ మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు సుమారు 50 మందితో అద్దె భవనంలో హోమ్ నిర్వహిస్తున్నానని స్థలం కేటాయించాలని ఎంపీ హరీష్ ను కోరగా అధికారులు చర్చించి నిర్ణయం తెలియజేస్తానని అన్నారు. కార్యక్రమానికి వచ్చిన వికలాంగులకు భోజనాలను ఎస్. కె ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు అందజేశారు.




Comments
Post a Comment