Skip to main content

శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి

  విశాఖ 

సాగర తీర 

తూర్పున 

వెలసిన 

శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న 

బాలాంజ 

నేయుడు 

సుందర 

వదనుడు,

సువిశాల 

మనస్కుడు,

పారిజాత 

ప్రియుడు,

లేత తమలపాకుల

నేత్రముల 

కలబోత 

గల వాడు.

వడల, అప్పాల

దండల ధారి.

దారిన పోయే 

వారిని తన 

దరి చేరి 

దర్శించు 

కొమ్మనే 

ఆకర్షిత 

మోము 

గల నాధుడు.

అందరికీ తన 

హస్తముతో 

అభయ మోస

గెడు వాడు.

మరొక 

కరములో 

గధా ధారి 

దుస్టుల యెడల 

హెచ్చరిక కు 

తార్కణము.

ఆతడి పసిడి 

పాదములు 

తాకాలని 

తలంపు 

లేని వాడు 

కాన రాడు 

అచ్చట.

అయోధ్య లో 

బాల రాముడు 

కొలువు దీరి 

అశేష భక్త 

కోటిని 

కటాక్షిస్తుంటే 

ఇచట. విశాఖ 

తూర్పు 

తీరాన 

శ్రీ ప్రసన్న 

బాలాంజ 

నేయుడు 

తన ప్రసన్న 

ముకులిత 

వదనం తో 

రా, రమ్మంటున్నా డనడం లో 

సందేహం 

వలదు.

అంతే కాదు 

తనకు తోడు 

జంట నాగులను,

నవ గ్రహాలను 

ప్రతిష్ట కు 

పరోక్షంగా 

అం్గీకరించి 

అనుగ్రహించిన 

అభయుడు 

మన ఆంజనేయుడు.

తండ్రీ అచ్చట 

నిద్ర గన్నేరు 

వృక్ష రాజము 

కొంచెము 

ఆటంకముగా 

ఉన్నది అని 

వారిని అభ్యర్థించిన 

వెను వెంటనే 

అభయమొసగిన 

ఘనుడవీవు.

అందుకే 

నీకు సదా 

మ్రక్కెదము 

మేమంతా,

మనసారా,

తనివి తీరా,

సదా నీ సేవలో 

మేమంతా 

తరించెడి 

అవకాశం 

కలుగ చేసి 

నందులకు.

తెలిసి, తెలియక 

తప్పులు 

చేసి ఉంటే 

మమ్ములను 

క్షమించి,

నీ అక్కున 

చేర్చుకుని 

అనుగ్రహించు 

ఓ హనుమా!



                Dr Nanduri Ramakrishna 

                         Sr Sub EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...