Skip to main content

అనుమతులు అక్కర్లేద్దు.... చెరువు తవ్వుకుంటాం..... యాదేచ్చగా అక్రమ ఆక్వా రంగం సిద్ధం.... కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుకు సిద్ధం...

.             SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం మొగలమూరు పంచాయతీ పరిధిలోని శిరగట్లపల్లి  గ్రామంలో అనుమతులు లేకుండానే  చెరువు తవ్వకాలు జరుగుతున్నాయంటూ గ్రామస్థులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ప్రజలు నివసిస్తున్న ఇళ్లకు ఆనుకుని చెరువు తవ్వకాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని  ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి ట్యాంక్ దగ్గరలో  తవ్వకాల జరిపి ఆక్వా సాగు చేస్తే తాగునీరు కలుషితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు

0

. కలుషిత నీటిని వినియోగించడం వల్ల గ్రామంలో కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ చెరువు తవ్వకాలను  అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో, జిల్లా కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి బాధితులు సిద్ధమవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చెరువు తవ్వకాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుని గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని స్థానికులు ముక్తకంఠంతో  కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...