ఎం ఆర్ డి ఎ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ గారి నేతృత్వంలో సమగ్ర వివరాలు సమర్పణ
వి ఎం ఆర్ డి ఎ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే లు శ్రీ విష్ణు కుమార్ రాజు గారు, బి.రామాంజనేయులు, శ్రీ రామ్ రాజు గోపాల్ గారు, శ్రీమతి కే.లలిత కుమారి, ఏజీ కార్యాలయం నుంచి డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సాయి కృష్ణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ విజయరాజు , వి ఎం ఆర్ డి ఎ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ గారు పాల్గొని చర్చించారు. వి ఎం ఆర్ డి ఎ ద్వారా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కార్మిక సెస్ వసూళ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని, సెస్ వసూళ్లపై అంతర్గత సమీక్ష వివరాలు, వసూలు చేసిన సెస్ బదలాయింపు అంశాలపై చర్చించారు. వీటికి సంబంధించి వి ఎం ఆర్ డి ఎ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ భారత్ గారి నేతృత్వంలో ప్రధాన ప్రణాళిక అధికారిణి శ్రీమతి దివ్యలత గారు వివరాలు అందించారు. భవన నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులు ఆయా స్థానిక సంస్థల నుంచి రాగా, వాటికి వి ఎం ఆర్ డి ఎ ద్వారా భవన నిర్మాణాలకు కేవలం సాంకేతిక అనుమతులు మాత్రమే ఇవ్వటం జరిగిందని, కార్మిక సెస్ వసూళ్ళు, వాటి బదలాయింపు వంటివి ఆయా స్థానిక సంస్థలు పర్యవేక్షణలో ఉన్నాయని వివరించారు. ఐతే ఆయా స్థానిక సంస్థలు కార్మిక సెస్ వసూళ్ల పై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు శ్రీ బి.రామాంజనేయులు వి ఎం ఆర్ డి ఎ లే అవుట్ల అభివృద్ధి చేసిన తర్వాత రైతులకు కేటాయించిన స్థలాల విషయంలో ఉన్న న్యాయపరమైన అంశాలపై చర్చించారు. అనంతరం వి ఎం ఆర్ డి ఎ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ గారు మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను తెలియజేశారు. కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఎ అదనపు కమిషనర్ శ్రీమతి దాట్ల కీర్తి, ఎస్టేట్ అధికారి దయానిధి, కార్యదర్శి మురళీ కృష్ణ, ఓ ఎస్ డి కృష్ణ నాయక్, ముఖ్య గణాంక అధికారి హరి ప్రసాద్, డి ఎఫ్ ఓ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
*కమిటీ చైర్మన్, సభ్యులకు సత్కారం*
ఆంధ్రపదేశ్ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులను వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

Comments
Post a Comment