Skip to main content

సత్యదేవుని సన్నిధిలో వైభవంగా ఆషాఢ పౌర్ణమి వేడుకలు!

.                    K.V.SHARMA EDITOR 
ఇసుక కొండ  పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి వేడుక 29-07-2026 బుధవారం నాడు వైభవంగా జరిగాయి. శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ అర్చకులు ఫణిహారం నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు , కుంకుమార్చనలు ఘనంగా  నిర్వహించారు. ఉదయం 4:00 గంటల నుండి వేలాది సంఖ్యలో భక్తుల తరలివచ్చి నూతనంగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ద్వారా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి అనంతరం శ్రీ రమా సహిత  సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. మూడు బ్యాచ్ లలో మొత్తం 148 దంపతలు స్వామి వారి వ్రతం చేయించుకున్నారు. వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు . ధర్మ కర్తల మండలి చైర్మన్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో 1000 భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. 


స్వామి వారిని హోమ్ శాఖా మాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు దర్శించుకున్నారు. వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు వేదాశీర్వచనం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ సీతంరాజు సుధాకర్ గారు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ టి రాజ గోపాల్ రెడ్డి, చైర్మన్ కె సూర్య ప్రసాద్ ఆధ్వర్యంలో పౌర్ణమి ఏర్పాట్లు పర్యవేక్షించారు

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...