Skip to main content

పరశురామ” అవతారంలో జగన్నాథ స్వామి!

.                   K.V.SHARMA EDITOR 
జగన్నాధ స్వామి వారు బుధవారం నాడు పరశురామ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. జగన్నాధ స్వామి వారి రథయాత్ర ఉత్సవాలలో భాగంగా టర్నర్ సత్రం ఆవరణలో దశావతారాలలో జగన్నాథ స్వామి దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామికి నాద స్వరం, నిత్య పూజ, లలిత సహస్ర నామార్చన, మేలుకొలుపు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథునికి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుండి ధర్మ కర్తల మండలి చైర్మన్ కోరుకొండ ప్రసాద్ మరియు సభ్యులు, అర్చకులు పట్టు వస్త్రాలను సమర్పించారు. 


వారికి ఈఓ రాజ గోపాల్ రెడ్డి, చైర్మన్ ఎస్ రాజ్ కుమార్ మరియు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికి, పూజ చేయించి,

 ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 800 భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.

Comments