విశాఖపట్నం టౌన్ కొత్తరోడ్ లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వారి రథయాత్ర మహోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామి వారి సంప్రోక్షణ పీఠారోహణం మరియు హుండీల లెక్కింపు జరిగింది.
విశాఖపట్నం టౌన్ కొత్తరోడ్ లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వారి రథయాత్ర మహోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామి వారి సంప్రోక్షణ పీఠారోహణం మరియు హుండీల లెక్కింపు జరిగింది. సోమవారం ఉదయం 10:00 గంటలకు ప్రధాన ఉత్సవ అధికారి (CFO) టి అన్నపూర్ణ గారు, ఆలయ EO టి.రాజగోపాల్ రెడ్డి, విశాఖ జిల్లా తనిఖీదారు ఎం శ్రీధర్, ధర్మ కర్తల మండలి చైర్మన్ ఎస్ రాజ్ కుమార్ మరియు సభ్యులు బి సత్యనారాయణ, ఆర్ రాము, ఎస్ జ్యోతి, యు ఆదిలక్ష్మి, పి కళ్యాణి, ఎమ్ రమణి, ఎన్ భాస్కర్, బి విజయదుర్గ, మంత్రి శాలివాహన్ మరియు పోలీసు వారి సమక్షంలో హుండీలు తెరిచి లెక్కింపు చేయగా, రథయాత్ర పది రోజులకుగాను హుండీ ఆదాయం ₹24,62,145/- వచ్చినది. ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలలో హుండీల ఆదాయం క్రిందటి సంవత్సరం కంటే ₹5,19,575/- అధికంగా వచ్చినది.
వచ్చే గురువారం అనగా 06-08-2026 న దేవస్థానం వద్దనే 5000 మందికి మహా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది.
శ్రీ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన పోలీస్ శాఖ వారికి, రెవిన్యూ శాఖ వారికి, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ వారికి, హెల్త్ శాఖ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, రోడ్లు భవనాల శాఖ వారికి, విద్యుత్ శాఖ వారికి, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మా హృదయ పూర్వక ధన్యవాదములు.
ఇట్లు కార్యనిర్వహణాధికారి
టి రాజగోపాల్ రెడ్డి

Comments
Post a Comment