Skip to main content

స్వామివారిని దర్శించుకున్న విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ ఎం. అభిషిక్త్ కిశోర్ ఐఏఎస్ దంపతులుసింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని బుధవారం దర్శించుకున్నారు.

.                   K.V.SHARMA EDITOR 
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు నాదస్వర మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ దంపతులు ముందుగా అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, తదుపరి స్వామివారి దర్శనం చేసుకున్నారు.


దర్శనానంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు స్వామివారి శేషవస్త్రంతో కలెక్టర్ దంపతులను సత్కరించి, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను జ్ఞాపికగా అందజేశారు.

అనంతరము 29 వ తేదీన గుడి ప్రదక్షణకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు

Comments