Skip to main content

మున్సిపాలిటీ విద్యుత్ వ్యయం తగ్గించేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రెండు దశల్లో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన: జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

.              SRINIVAS SPL Correspondant 
 అమలాపురం, విశాఖ సందేసం.....మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు సౌర విద్యుత్ ప్రాజెక్టు అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో మున్సిపల్ అధికారులతో తాగునీటి పంపింగ్ వ్యవస్థలు, వీధి దీపాలు, మున్సిపల్ కార్యాలయాలు తదితర సేవలకు సంబంధించి విద్యుత్ వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  మున్సిపాలిటీ పరిధిలోని 288 విద్యుత్ కనెక్షన్ల ద్వారా నెలకు సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. విద్యుత్ చార్జీల రూపంలో నెలకు సుమారు రూ.11 లక్షలు వ్యయం అవుతున్నందున, ఈ భారాన్ని తగ్గించేందుకు మొత్తం 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. మొదటి దశలో నడిపూడి రా వాటర్ వర్క్స్ వద్ద స్థల పరిమితులను దృష్టిలో ఉంచుకుని 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.4.50 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో 75 శాతం, అంటే సుమారు రూ.3.60 కోట్లను బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకునే ప్రతిపాదనపై కలెక్టర్ సమీక్షించారు. రుణంపై వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, నెలవారీ చెల్లింపులు తదితర అంశాలను పూర్తిగా పరిశీలించి, మున్సిపాలిటీకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రెండో దశలో ప్రభుత్వ భవనాలు, మున్సిపల్ ఆస్తులపై మరో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసి మొత్తం 1 మెగావాట్ సామర్థ్యాన్ని సాధించాలని నిర్ణయించారు.


మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో గుర్తించిన సుమారు 1,700 చదరపు మీటర్ల రూఫ్‌టాప్ ప్రాంతంలో 516 కిలోవాట్ల వరకు సౌర విద్యుత్ సామర్థ్యం సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. రెండో దశకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి పరిపాలనా అనుమతుల కోసం సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. డీపీఆర్‌లో ప్రాజెక్టు వ్యయం, విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ పొదుపు, నిర్వహణ వ్యయం, ఫైనాన్సింగ్ విధానం తదితర అంశాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా మున్సిపాలిటీకి దీర్ఘకాలికంగా విద్యుత్ వ్యయం తగ్గేలా ప్రాజెక్టు ఆర్థిక సాధ్యతను సమగ్రంగా అంచనా వేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ శాఖ, డిస్కం, ఏపీ ఈఆర్‌సీ నిబంధనలు, సాంకేతిక మరియు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా మున్సిపాలిటీపై విద్యుత్ వ్యయ భారాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ భవనాల్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ కె. రాంబాబు, సోలార్ ఆస్ట్రిచ్ సీఈఓ రాజేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎం కె. పృథ్వీరాజ్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బి. పవన్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...