జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి. వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా 150 మీటర్ల( 450 అడుగులు) భారీ జాతీయ జెండా ర్యాలీ...
స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ నందు భారత జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి. వెంకయ్య గారి 150 వ జయంతి కార్యక్రమాన్ని 150 మీటర్ల( 450 అడుగులు) జెండా ర్యాలీతో ఘనంగా నిర్వహించారు. వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.C.M.A. జహీర్ అహ్మద్ , రౌండ్ టేబుల్ సంస్థ మాజీ చైర్మన్ మక్సుద్ అహ్మద్ ఆధ్వర్యంలో 150 మీటర్ల భారీ జాతీయ జెండాను వివేకానంద సంస్థ నుండి రాణీ బొమ్మ వరకు జెండా ర్యాలీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, మన దేశానికి ప్రత్యేక జండా ఉండాలని ధ్యేయంగా, జాతీయ జెండాను రూపొందించిన మహోన్నత వ్యక్తి పింగళి వెంకయ్య. ఆయన జయంతిని చేసుకోవడం స్ఫూర్తిదాయకం, కోట్లాది మంది భారతీయుల్ని ఒకే తాటిపైకి తెచ్చిన బహుముఖ ప్రజ్ఞశాలి. ఆయన గుర్తుగా 150 మీటర్ల భారీ జెండా ర్యాలీ వివేకానంద సంస్థ వారు నిర్వహించడం చాలా ఆదర్శనీయం. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను గుర్తించి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, పింగళి వెంకయ్య విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని, పింగళి వెంకయ్య గారి జయంతిని జాతీయ పండుగగా నిర్వహించాలని ఈ సందర్భంగా డాక్టర్ గారు కోరారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు, వివేకానంద సంస్థ సీనియర్ సభ్యులుT. సాయి బలరాం, ప్రముఖ సంఘ సేవకులు T. కృష్ణ ,సంస్థ సభ్యులు, మరియు మహిళా సభ్యులు అధిక సంఖ్యలో ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు





Comments
Post a Comment