భీమ్ నగర్ మరియు అల్లిపురం ఏరియా లో 2 డెంగీ కేసులు నమోదు అయిన దృష్ట్యా శ్రీ.వరప్రసాద్ రెడ్డి,జిల్లా మలేరియా అధికారి మరియు బి.నాగభూషణరావు సహాయ మలేరియా అధికారి వారి సిబ్బంది తో కలిసి హుటాహుటిన ఆయా ప్రదేశాలు సందర్శించి ఈ క్రింద వ్యాధి నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది.
విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని :వ్యాధి నమోదు అయిన ఇంటి నుండి చుట్టుపక్కల సుమారు 100 ఇళ్ళు తనిఖీ చేసి లార్వా కనుగొన్న సుమారు 15 ప్రాంతాల్లో లార్వా నిర్ములన చేయడం జరిగింది.డెంగ్యూ వ్యాధి సోకిన ఇంట్లో మరియు చుట్టుప్రక్కల ఇళ్లల్లో ఇండోర్ రెసిడ్యూల్ స్ప్రే చేయడం జరిగింది
ఓపెన్ డ్రైన్ లో యాంటీ లార్వా మందులతో పిచికారీ చెయ్యడం జరిగిందిచుట్టుపక్కల ఇళ్ళల్లో ఫీవర్ సర్వే నిర్వహించి కీటక జనిత వ్యాధుల నుండి రక్షణ కొరకు మరియు దోమలు ఇంటి పరిసర ప్రాంతాల్లో గుడ్లు పెట్టకుండా తీసుకోవలసిన చర్యలు,
డ్రై డే ఫ్రైడే ప్రాముఖ్యత గురించి కరపత్రాలు సహాయంతో వివరించడం జరిగింది.దోమ లార్వాలను ప్రత్యక్షంగా చూపించి అవగహన కలిపించడం అయ్యింది.ఫీవర్ సర్వే మరియు యాంటీ లార్వా ఆపరేషన్ ల పట్ల సిబ్బంది కి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక ANM, ఆశ,జీవీఎంసీ సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు మురళి ,గణేష్ తదితరులు పాల్గొన్నారు...ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు..
K.V.SHARMA EDITOR




Comments
Post a Comment