Skip to main content

జీవీఎంసీ అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలి. *2025–26 అభివృద్ధి పనులు, 2026–27 ప్రాధాన్యత పనులు, కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష. *రోడ్లు, జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ప్రణాళికలు. *పెండింగ్ పనుల్లో జాప్యానికి కారణాలను పరిష్కరించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలి.

 


విశాఖపట్నం, ఆగస్టు 19: జీవీఎంసీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేసి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు.

బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ప్రత్యేక అధికారి ఛాంబర్‌లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో కలిసి అభివృద్ధి పనులపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, 2026–27లో ప్రాధాన్యతగా చేపట్టిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, చేపట్టాల్సిన, ప్రతిపాదిత పనులు, వివిధ ప్రాజెక్టులతో పాటు రాబోయే పార్టనర్‌షిప్ సమ్మిట్ నేపథ్యంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులపై క్షుణ్ణంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ కేటగిరీలకు సంబంధించిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, ఇప్పటివరకు సాధించిన పురోగతి, చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణను ప్రత్యేక అధికారికి వివరించారు. జీవీఎంసీ నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతర పథకాలు, ప్రాజెక్టుల కింద చేపడుతున్న పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 ప్రధానంగా రోడ్లు, జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, డ్రైన్లు, పార్కులు, స్మశాన వాటికలు, సెంట్రల్ మీడియన్లు, ఆధునిక పబ్లిక్ టాయిలెట్లు, చెరువుల సుందరీకరణ, వీధి దీపాలు, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, స్టేడియంలు, తాగునీటి సదుపాయాలు, సర్వీస్ రోడ్ల అభివృద్ధి, జోనల్ కార్యాలయాల నిర్మాణం తదితర పనులపై సమీక్షించారు. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF), అమృత్ 2.0, ప్రాజెక్ట్ సారథి కింద చేపడుతున్న పనులతో పాటు రాబోయే పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు సంబంధించి ప్రతిపాదించిన పనుల పురోగతిని పరిశీలించారు.

 నగరంలో ప్రస్తుతం ఉన్న జంక్షన్లు, అభివృద్ధి చేస్తున్న జంక్షన్లు, ఇంకా అభివృద్ధి చేయాల్సిన జంక్షన్ల వివరాలను ప్రత్యేక అధికారి అడిగి తెలుసుకున్నారు. వాటి అభివృద్ధి, నిర్వహణకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించి, ప్రాధాన్యత పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నగర భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న జనాభా, రాకపోకలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్లు, జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, కాలువలు, పార్కులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. బీచ్ ప్రాంతంలోని పార్కులను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

కొన్ని అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి కాకపోవడంపై ప్రత్యేక అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. జాప్యానికి గల కారణాలను గుర్తించి, సంబంధిత విభాగాలు సమన్వయంతో క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కొనసాగుతున్న పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ, నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేసేందుకు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతిపాదిత పనులకు ముందుగానే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి, అన్ని అవసరమైన మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

 తదుపరి సమీక్షా సమావేశానికి జీవీఎంసీ పరిధిలో చేపడుతున్న ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంగా హాజరు కావాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. ప్రతిపాదన దశ, పరిపాలనా అనుమతులు, టెండర్ ప్రక్రియ, వర్క్ ఆర్డర్, పనుల ప్రారంభం, ప్రస్తుత పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలి ఉన్న పనులు, పూర్తి చేయాల్సిన గడువు తదితర వివరాలను ప్రాజెక్టుల వారీగా దశలవారీగా సిద్ధం చేసి తదుపరి సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు.

 ఈ సమీక్షలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు, పీఎంయు ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ



Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...