Skip to main content

జర్నలిస్టుల పిల్లలకు విద్యాప్రోత్సహకాలు* *2026లో 182 మందికి ఉపకార వేతనాలు* *విద్యతోనే అపార ఉపాధి అవకాశాలు* *ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం*... *జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల*

 


అక్కయ్యపాలెం జంక్షన్ ,ఆగస్టు 13*ప్రపంచ వ్యాప్తంగా  విద్యతోనే అపార ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ ఏజె), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ర్ట నాయకులు *గంట్ల శ్రీనుబాబు* *అన్నారు


. ఈ మేరకు శుక్రవారం అక్కయ్యపాలెంలోని తన కార్యాలయంలో 9 మంది జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలను గంట్ల శ్రీనుబాబు అందజేశారు. సిఏ 


విద్యాభ్యాసం సాగిస్తున్న సిహెచ్ అమృత యాదవ్ , వైఎస్ ఎన్ ఎస్ లిఖిత్ (పదోతరగతి), సిహెచ్ మనోజ్ యాదవ్ (9వతరగతి), కె.జోషఫ్ రాజు(8వతరగతి) బి.హర్షిత్ రామ్ (4వతరగతి), కొల్లి జైస్వాల్ (ఎల్ కెజి), ఎస్.భవదీప్ (రెండోతరగతి), ఎస్. గుణదీప్ (యుకెజి), కొల్లి మహాన్ష్ (రెండోతరగతి) తదితరులకు ప్రశంసా పత్రం, నగదు, ఇతర ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. 


ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా జర్నలిస్టుల పిల్లలకు క్రమం తప్పకుండా ఉపకార వేతనాలను అందజేస్తూ వస్తున్నామన్నారు. ఈ ఏడాది *జూన్ 28న* *152 మందిపిల్లలకు ఉపకార వేతనాలు అందజేశామన్నారు. ఆ తరువాత దశల వారీగా మరో 30 మంది పిల్లలకు కూడా విద్యా ప్రోత్సాహకాలను అందజేస్తూ రావడం జరిగిందన్నారు


. ఇందులో నలుగురు బీటెక్ విద్యార్ధులకు గత మూడేళ్లుగా తాను సొంతంగా ఫీజులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. అలాగే వివిధ తరగతుల్లో విద్యాభ్యాసం సాగిస్తున్న వారిని తన పరిధి మేరకు ఆర్ధిక సాయం చేసి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో కులాలు, మతాలు, యూనియన్ లకు ప్రమేయం లేదన్నారు. గత కొన్నేళ్లుగా తాను ఈ కార్యక్రమాన్ని తన పరిధి మేరకు నిర్వహిస్తూ వస్తున్నట్లు గంట్ల శ్రీనుబాబు చెప్పారు.


 ప్రతిభను ప్రోత్సహించడం,  పిల్లల్లో ప్రతిభా పాటవాలను గుర్తించడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. ఇటువంటి విద్యాప్రోత్సాహకాల వల్ల వారిలో నూతన ఉత్సాహం కలగడంతో పాటు భవిష్యత్తులో ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తారన్నారు. 


దేశ, విదేశాల్లో ఎక్కడ స్థిరపడిన వారికి తాము ఎప్పుడూ జ్ఞాపకంగా ఉంటామని అదే తనకు ఆత్మసంతృప్తి కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు*.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...