Skip to main content

ప్రింట్ మీడియా & ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటన* *శ్రీమతిపాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు* *జీవో–3కు చట్టబద్ధత కల్పించాలి – 1/70, 5వ షెడ్యూల్, PESA చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి* *ఆదివాసీల భూమి, అడవి, నీరు, సంస్కృతి, హక్కులను పరిరక్షించాలి* * *– ధింసా కళాకారులకు గుర్తింపు కార్డులు, నెలవారీ పెన్షన్ ఇవ్వాలి*


అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆగస్టు 9:అంతర్జాతీయ ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని* *చాపరాయి జలపాతం వద్ద ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అబ్జర్వర్, ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి* *ఆధ్వర్యంలో 32వ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధింసా* *కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి, సంప్రదాయ ధింసా నృత్యాలతో వేడుకలను నిర్వహించారు*.

*ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ.. ఆదివాసీల భూమి, అడవి, నీరు, సంస్కృతి*, *సంప్రదాయాలు, జీవన హక్కులను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన 5వ షెడ్యూల్, PESA, 1/70 చట్టాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు*.

*జీవో–3కు చట్టబద్ధత కల్పించాలి*

*గిరిజన నిరుద్యోగులు, ఉద్యోగులకు న్యాయం* *జరిగేలా జీవో నంబర్–3కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని శాంతకుమారి డిమాండ్ చేశారు*

*గిరిజన యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు.* *“మాట తప్పవద్దు.. మడమ తిప్పవద్దు.. గిరిజనులను మోసం చేయవద్దు” అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె సూచించారు.*

*జీవో 51, 13, 2లను* *ఉపసంహరించుకోవాలి*5వ షెడ్యూల్ పరిధిలో* *గిరిజనుల ప్రయోజనాలకు విరుద్ధంగా చేపట్టే హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్* *తదితర ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.*

*జీవో నంబర్లు 51, 13, 2కు సంబంధించిన ప్రాజెక్టులను ప్రభుత్వం పునఃసమీక్షించి, గిరిజనుల జీవన విధానం, అడవులు, పర్యావరణానికి నష్టం కలిగించే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామసభల అభిప్రాయాలను, గిరిజనుల హక్కులను పక్కనపెట్టి ఎలాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు*.

*ధింసా కళాకారులకు గుర్తింపు, పెన్షన్ ఇవ్వాలి*

*ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను* *తరతరాలకు అందిస్తున్న ధింసా కళాకారులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని శాంతకుమారి కోరారు*

*కళాకారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఐటీడీఏ ద్వారా ప్రతినెలా పెన్షన్ మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఆదివాసీ కళలు,* *సంప్రదాయ నృత్యాలు కనుమరుగుకాకుండా ప్రత్యేక సాంస్కృతిక పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు*.


*ఆదివాసీ యువతకు* *విద్య, ఉపాధి కల్పించాలి*

*గిరిజన ప్రాంతాల్లో* *నాణ్యమైన విద్య, ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక ఉపాధి* **అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని శాంతకుమారి కోరారు*.

*అడవులు, భూములు,* *జలవనరులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీల జీవనోపాధిని కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడకుండా జరిగే అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదని స్పష్టం చేశారు.*

*కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది*

*ఆదివాసీల హక్కులు, రాజ్యాంగ రక్షణలు, భూమి–అడవి–నీటి హక్కులు, విద్య–ఉపాధి, సంస్కృతి పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని శాంతకుమారి తెలిపారు.*


*జీవో–3కు చట్టబద్ధత కల్పించే వరకు, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే వరకు, 5వ షెడ్యూల్–PESA హక్కులను పరిరక్షించే వరకు, ఆదివాసీల భూములు–అడవులు–జలవనరులకు రక్షణ కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.*

*“ఆదివాసీ హక్కుల పరిరక్షణే మా లక్ష్యం – ఆదివాసీ భవిష్యత్తు రక్షణే మా బాధ్యత” అని శాంతకుమారి పేర్కొన్నారు.*

*ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్, ధింసా కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...