స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజరేష్టన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం బీసీ సెల్ అధ్యక్షుడు కొణతాల వెంకట అప్పారావు శ్రీనివాస్ అన్నారు.
విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తా వాహిని: బుధవారం విశాఖలో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి సీతంరాజు సుధాకర్ సూచన మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమం, రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఇది బీసీల ప్రభుత్వం అని మరోసారి రుజువు చేసిందన్నారు.దివంగత నందమూరి తారక రామారావు బీసీల రాజకీయ సాధికారత కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారని, ఆయన బాటలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో బీసీలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి అనేక అవకాశాలు కల్పిస్తున్నారన్నారు.టిడిపి పార్టీ అంటేనే బీసీల పార్టీ అని భారతదేశంలో ఏ పార్టీ చేయలేని విధంగా బీసీలను అభివృద్ధి పదంలో నడిపించే పార్టీ ఒక్క టిడిపి పార్టీ అన్నారు. కూటమి ప్రభుత్వం సామాన్య కార్యకర్త బీసీ వడ్డెర కులానికి చెందిన రమాదేవి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభలో కూర్చోబెట్టడం అనేది ఎంతో గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో ప్రతి కార్యకర్త ఆ స్థాయికి చేరుకోవచ్చనే ఆశని,ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.పార్టీ కోసం కష్టపడి పని చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు లభిస్తాయని అర్థమయ్యేలా చేసిందని 2029 లో కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రతి టిడిపి కార్యకర్త కష్టపడి పనిచేస్తారన్నారు.మీడియా సమావేశంలో బీసీ నాయకుడు నూకరాజు కూడా పాల్గొన్నారు.

Comments
Post a Comment