Skip to main content

నీటి ఎద్దడి ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన జీవీఎంసీ మంచినీటి సరఫరా. *తెల్లవారుజాము 4 గంటల నుంచే క్షేత్రస్థాయిలో జీవీఎంసీ అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ. *ఆరిలోవపై ప్రత్యేక దృష్టి... ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాతో పాటు నాణ్యత తనిఖీలు. *“డయల్-ఏ-ట్యాంకర్”, ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రాధాన్యతతో నీటి సరఫరా. *కైలాసనగర్, శ్రీహరినగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా పరిశీలన... స్థానికుల నుంచి సానుకూల స్పందన. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.


 విశాఖపట్నం, ఆగస్టు 9: నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.


కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచే అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజనీర్ పి.వి.వి. సత్యనారాయణ రాజు, తూర్పు జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్, నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీర్ పల్లంరాజు, సంబంధిత కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.


ఆరిలోవపై ప్రత్యేక దృష్టి" ముడసర్లోవ వాటర్ వర్క్స్ నుంచి జీవీఎంసీ, ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి ఆరిలోవతో పాటు అవసరమైన ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆరిలోవలో నీటి సరఫరాను ప్రధాన ఇంజనీర్, నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీర్ తదితరులు పరిశీలించడంతో పాటు ప్రజలకు సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.

“డయల్-ఏ-ట్యాంకర్” – ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రాధాన్యత.

జీవీఎంసీ “డయల్-ఏ-ట్యాంకర్” సేవ, ఆన్‌లైన్ ద్వారా ట్యాంకర్లను బుక్ చేసుకున్న ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత ప్రాంతాలకు ట్యాంకర్లను పంపించి నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లతో పాటు అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ నీటి వనరులు, అనుసంధానాల ద్వారా సరఫరాను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు


ఎత్తైన ప్రాంతాల్లోనూ నీటి సరఫరా" అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, తూర్పు జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కైలాసనగర్, శ్రీహరినగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాను పరిశీలించారు. ఎత్తైన ప్రాంతాలైనప్పటికీ తగిన ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతున్నట్లు గుర్తించారని, స్థానికులతో మాట్లాడగా నీటి సరఫరాపై సానుకూల స్పందన వ్యక్తమైనట్లు కమిషనర్ తెలిపారు.

ఆరిలోవ 13వ వార్డుకు TSR నీటిని అనుసంధానం చేసి సరఫరాను మరింత మెరుగుపరిచే ప్రత్యామ్నాయంపై కూడా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

నీటి అవసరమున్న ప్రతి ప్రాంతానికి సకాలంలో నీటిని అందిస్తూ, నీటి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు క్షేత్రస్థాయి ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగిస్తూ, వృథాను నివారించి జీవీఎంసీకి సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు.

పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ,

                 K.V.SHARMA EDITOR


Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...