Skip to main content

మాస్కోలో 5వ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సమ్మిట్‌లో విశాఖ అభివృద్ధి విజన్‌ను ఆవిష్కరించిన ఎంపీ ఎం. శ్రీభరత్. *జీవీఎంసీ–మాస్కో ప్రభుత్వాల మధ్య సహకార ఒప్పందం... ప్రపంచస్థాయి సాంకేతికతలు, ఉత్తమ విధానాల భాగస్వామ్యానికి నాంది. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.


విశాఖపట్నం, ఆగస్టు 4:రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన 5వ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సమ్మిట్లో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీభరత్ విశాఖ నగర అభివృద్ధి విజన్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణాభివృద్ధి కార్యక్రమాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించినట్లు జీవీఎంసీ కమిషనర్  కేతన్ గార్గ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ మరియు మాస్కో ప్రభుత్వాల మధ్య మెమోరాండం ఆఫ్ కోఆపరేషన్ (MoC) కుదిరిందని, అనంతరం మాస్కో డిప్యూటీ మేయర్ మరియు రవాణా, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖాధిపతి మక్సిమ్ లిక్సుటోవ్తో సమావేశమై పరస్పరం అభినందనలు తెలియజేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మార్గదర్శకత్వంలో విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మాస్కో ప్రభుత్వంతో కుదిరిన ఈ సహకార ఒప్పందం ద్వారా ప్రపంచస్థాయి సాంకేతికతలు, వినూత్న రవాణా విధానాలు, ఉత్తమ పట్టణాభివృద్ధి నమూనాలను విశాఖకు తీసుకురావడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.


కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, సమ్మిట్ సందర్భంగా అంతర్జాతీయ ప్రతినిధులకు జీవీఎంసీ అమలు చేస్తున్న ప్రాజెక్ట్ సారథి (SARTHI) – ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS), eRT రవాణా వ్యవస్థ, సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌ల అభివృద్ధి, ప్రధాన రహదారుల విస్తరణ, డిజిటల్ పౌర సేవలు, సాంకేతిక ఆధారిత తాగునీటి సరఫరా పర్యవేక్షణ, జనన–మరణ ధ్రువీకరణ పత్రాల డిజిటల్ సేవలు, స్మార్ట్ వెండింగ్ జోన్లు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ తదితర కార్యక్రమాల గురించి వివరించినట్లు తెలిపారు.

మాస్కో ప్రభుత్వంతో కుదిరిన ఈ సహకార ఒప్పందం ద్వారా స్మార్ట్ మొబిలిటీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ (ITS), ఎలక్ట్రిక్ రవాణా, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజిటల్ పరివర్తన రంగాల్లో ప్రపంచస్థాయి అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునే అవకాశం లభిస్తుందని కమిషనర్ తెలిపారు.

ఈ భాగస్వామ్యం ద్వారా విశాఖలో ఆధునిక పట్టణ రవాణా పరిష్కారాల అమలుకు మరింత ఊతం లభిస్తుందని, అలాగే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) ను ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాస్కో డిప్యూటీ మేయర్ మక్సిమ్ లిక్సుటోవ్ మాట్లాడుతూ, భారతదేశంతో, ముఖ్యంగా విశాఖపట్నంతో ఏర్పడిన ఈ భాగస్వామ్యం ద్వారా విజ్ఞాన మార్పిడి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పారిశ్రామిక సహకారం తదితర రంగాల్లో దీర్ఘకాలిక సహకారం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.


గమనిక: ఈ కార్యక్రమానికి సంబంధించిన మాస్కో డిప్యూటీ మేయర్ మక్సిమ్ లిక్సుటోవ్, విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్, జీవీఎంసీ కమిషనర్  కేతన్ గార్గ్ ప్రసంగాల వీడియోలను ఈ పత్రికా ప్రకటనతో పాటు మీడియాకు జతచేయడం జరిగింది.


పౌర సంబంధాల అధికారి  

జీవీఎంసీ

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...