శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడిన 'శ్రీవాణి' మాసపత్రిక సాహిత్య ప్రస్థానం ఆగస్టు 2026 నాటికి 500వ మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించబడుచున్నవి. శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు 1985 జనవరిలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించారు. పాఠకులు, అభిమానులు, శ్రేయోభిలాషుల విశేష ఆదరణతో 'శ్రీవాణి' తన సాహిత్య ప్రస్థానాన్ని నిరంతరం కొనసాగిస్తూ 500వ సంచిక అనే చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంటోంది.
ఈ సందర్భంగా 2026 ఆగస్టు 8వ తేదీ శనివారం, విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో 'శ్రీవాణి' సాహిత్య ప్రస్థానంపై వీడియో ప్రదర్శన, అలాగే శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావు జీవన సాహిత్య ప్రస్థానంపై లఘుచిత్ర ప్రదర్శన నిర్వహించనున్నారు. సభా. కార్యక్రమం ఉదయం 10.36 గంటలకు ప్రారంభమవుతుంది.
ప్రముఖ అతిథులు
ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై తమ సందేశాలను అందించనున్నారు. వారిలో
మాన్యశ్రీ జస్టిస్ శ్రీ ఎన్.వి. రమణ, సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి, మాస్యశ్రీ ఆర్.కె. రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్
మాన్యశ్రీ కంభంపాటి హరిబాబు, గౌరవ గవర్నర్, ఒడిశా
మాస్యశ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), పార్లమెంట్ సభ్యులు, విజయవాడ
మాస్యశ్రీ కొల్లు రవీంద్ర, గౌ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఇతర ప్రముఖులు, సాహితీవేత్తలు, శ్రీవాణి అభిమానులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొననున్నారు. ఈ చారిత్రాత్మక 600వ మైలురాయి వేడుకల్లో సాహితీ అభిమానులు, పాఠకులు, శ్రీవాణి అభిమానులు మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలెను. సధా కార్యక్రమానంతరం విందు ఏర్పాటు చేయబడినది.
కొమరగిరి శ్యామ్ ప్రసాద్, సంపాదకులు, శ్రీవాణి పత్రిక
+91 98481 53523
Comments
Post a Comment