పోర్ట్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 100 మిలియన్ టన్నుల కార్గో మైలురాయిని అధిగమిస్తామన్న వీఎపీఏ చైర్పర్సన్ జె.ఎస్. బింద్రా
. K.V.SHARMA EDITOR
విశాఖపట్నం ఆగస్టు 15, మేజర్న్యూస్: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పోర్ట్ గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోర్ట్ చైర్పర్సన్ జె.ఎస్. బింద్రా, ఐఆర్డీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఐఎస్ఎఫ్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించగా, చైర్పర్సన్ పరేడ్ను పరిశీలించి సల్యూట్ స్వీకరించారు. ఈ సందర్భంగా బింద్రా స్వాతంత్య్ర సమరయోధులకు, దేశ రక్షణలో సేవలందిస్తున్న సాయుధ దళాల సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047లో భాగంగా భారతదేశం సాధిస్తున్న సముద్ర రంగ అభివృద్ధిని ఆయన వివరించారు. 2025--26 5 సంవత్సరంలో పోర్ట్ చరిత్రలోనే అత్యధికంగా 91.17 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) వార్షిక కార్గో నిర్వహణ సాధించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 10.34 శాతం వృద్ధి అని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి కొనసాగుతోందని, ఏప్రిల్- జూలై 2026 మధ్య 32.10 ఎంఎంటీల కార్గోను నిర్వహించామని, గత ఏడాది ఇదే కాలంలో నిర్వహించిన 28.34 ఎంఎంటీలతో పోలిస్తే దాదాపు 13 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. విశాఖపట్నం పోర్ట్ సాధించిన కీలక విజయాలను ప్రస్తావిస్తూ, 2026 జూన్ 5న ఈక్యూ-1 బెర్త్ వద్ద 292 మీటర్ల పొడవైన కేప్సైజ్ నౌకను విజయవంతంగా బెర్తింగ్ చేయడం, 24 గంటల్లో 24 నౌకల రాకపోకలను నిర్వహించడం, అలాగే ఒకే రోజులో 5.5 లక్షల టన్నుల కార్గోను నిర్వహించడం వంటి ఘనతలను ఆయన వివరించారు.
విశాఖపట్నం ఆగస్టు 15, మేజర్న్యూస్: విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పోర్ట్ గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోర్ట్ చైర్పర్సన్ జె.ఎస్. బింద్రా, ఐఆర్డీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఐఎస్ఎఫ్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించగా, చైర్పర్సన్ పరేడ్ను పరిశీలించి సల్యూట్ స్వీకరించారు. ఈ సందర్భంగా బింద్రా స్వాతంత్య్ర సమరయోధులకు, దేశ రక్షణలో సేవలందిస్తున్న సాయుధ దళాల సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047లో భాగంగా భారతదేశం సాధిస్తున్న సముద్ర రంగ అభివృద్ధిని ఆయన వివరించారు. 2025--26 5 సంవత్సరంలో పోర్ట్ చరిత్రలోనే అత్యధికంగా 91.17 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) వార్షిక కార్గో నిర్వహణ సాధించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 10.34 శాతం వృద్ధి అని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి కొనసాగుతోందని, ఏప్రిల్- జూలై 2026 మధ్య 32.10 ఎంఎంటీల కార్గోను నిర్వహించామని, గత ఏడాది ఇదే కాలంలో నిర్వహించిన 28.34 ఎంఎంటీలతో పోలిస్తే దాదాపు 13 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. విశాఖపట్నం పోర్ట్ సాధించిన కీలక విజయాలను ప్రస్తావిస్తూ, 2026 జూన్ 5న ఈక్యూ-1 బెర్త్ వద్ద 292 మీటర్ల పొడవైన కేప్సైజ్ నౌకను విజయవంతంగా బెర్తింగ్ చేయడం, 24 గంటల్లో 24 నౌకల రాకపోకలను నిర్వహించడం, అలాగే ఒకే రోజులో 5.5 లక్షల టన్నుల కార్గోను నిర్వహించడం వంటి ఘనతలను ఆయన వివరించారు.

Comments
Post a Comment