శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచలం గోశాలలో ఆధునిక గ్రాసం కట్టర్ ప్రారంభించిన ఆలయ కార్య నిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకటరావు.
సింహాచలం, జూలై 31: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన కృష్ణాపురం గోశాలలో గోవులకు మేతను వేగంగా అందించేందుకు ఒక భక్తుడు అందించిన ఆధునిక గ్రాసం కట్టర్ యంత్రాన్ని శుక్రవారం ఆలయ కార్య నిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకటరావు. ప్రారంభించారు.
గోశాల పర్యవేక్షణ అధికారి (ఇన్చార్జ్) మూలా వాసు పర్యవేక్షణ లో సుమారు రూ. 1.80 లక్షల విలువైన ఈ యంత్రానికి ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరము గోవును పూజించి మేతను అందించారు
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణాపురం గోశాలలో దాదాపు 280 దేశవాళీ గోవులను సంరక్షిస్తున్నామని తెలిపారు. గోవులకు అవసరమైన పచ్చిగ్రాసాన్ని ఇక్కడే సాగు చేస్తూ, వాటి ఆరోగ్యం, వసతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
భక్తుల సహకారంతో ఇలాంటి ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల గోసేవ మరింత సులభతరం అవుతుందని, విరాళాలు అందించిన భక్తులకు స్వామివారి కృపాకటాక్షాలు ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోశాల పర్యవేక్షణ అధికారి (ఇన్చార్జ్) మూలా వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.




Comments
Post a Comment