Skip to main content

ఆర్యవైశ్య యువజన సంఘం నకు ఎన్నికలు


ఆర్యవైశ్య యువజన సంఘం, విశాఖపట్నం నకు 2026-27 సంవత్సరమునకు సంబంధించి నూతన కార్యవర్గం ను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం తక్షణ మాజీ అధ్యక్షుడు  శ్రీ దుర్గా సోమేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆగస్టు 23వ తేదీ నాడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల వాసవి భవన్ లో నిర్వహించనున్న ఆర్యవైశ్య యువజన సంఘం 50వ వార్షిక సర్వసభ్య సమావేశము మరియు 2026-27 నకు నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  సంఘ నిబంధనలకు అనుగుణంగా ఒక అధ్యక్షుడు, ఒక కార్యదర్శి, ఒక కోశాధికారితో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు సహాయ కార్యదర్శులు, ఒక సంయుక్త కోశాధికారి మరియు 42 మంది కార్యవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

ఆగష్ట్ 5 వతేది నుండి 11వ తేది వరకు సంఘం ఆఫీసులో నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చని, 12వ తేది పరిశీలన, 13వ తేది ప్రకటన, ఉపసంహరణ 14 నుండి 16 వరకు, మరియు 16వ తేది ప్రకటన మరియు 23వ తేది ఆదివారం నాడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఆర్యవైశ్య యువజన సంఘం అభివృద్ధికి తగిన సమయం వెచ్చించగలిగే సంఘ సభ్యులు పోటీలో పాల్గొనాలని తెలిపారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...