Skip to main content

హాస్టల్ సరుకుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలి - అధికారులతో సమీక్షించిన వీసీ

.                    K.V.SHARMA EDITOR 
ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆగస్టు 4:హాస్టల్లో విద్యార్థులకు  మెస్ లలో వినియోగించే ఆహార పదార్థాల నాణ్యత ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన చీఫ్ వార్డెన్లు ఇతర అధికారులతో హాస్టల్స్ నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ హాస్టల్ కమిటీలకు సంబంధించిన విధులను స్పష్టంగా తెలియజేయాలని, వారు ప్రతిరోజు పర్యవేక్షణ జరిపే విధంగా చీఫ్ వార్డెన్స్ శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతిరోజు మెస్ లలో ఉండే ఆహార పదార్థాల నాణ్యత, స్టోర్ లలో నిల్వచేసిన కూరగాయలు, ఇతర వస్తువుల నాణ్యతను తరచు తనిఖీ చేయాలని తద్వారా నాణ్యతలో రాజీ లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు ఇద్దరు చొప్పున ఒక మెస్ లో భోజన నాణ్యతను పర్యవేక్షించడం, తనిఖీ చేసే బాధ్యతలను స్వీకరించాలని తెలిపారు. వీరికి ఆ రోజుకు సంబంధించిన అటెండెన్స్ సైతం ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు.

మెస్ లో తయారు చేసే భోజనంలో  లోపాలు కనిపిస్తే దానికి సంబంధిత సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుంది. భోజన తయారీకి వినియోగించే ఆహార పదార్థాలలో నాణ్యత లోపిస్తే వాటిని సరఫరా చేసే సంబంధిత ఏజెన్సీ పై చర్యలు తీసుకోబడతాయి.


విద్యార్థులు కోరిన విధంగా వైఫై సదుపాయం, సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని మౌలిక వసతుల కల్పన విభాగానికి ఆదేశించారు. రేపు డీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్వయంగా హాస్టల్స్ ను పరిశీలించి అక్కడ అవసరమైన మరమ్మత్తులు సంబంధించి ఒక నివేదిక సిద్ధం చేయాలని, అవసరమైన పనులను త్వరితగతిన చేపట్టాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆచార్యులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెల్ బీయింగ్ కమిటీలు ప్రతి వారం హాస్టల్ మెస్ లను సందర్శించడం అక్కడ విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతను పరిశీలించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా సమిష్టిగా పని చేయాలని అధికారులకు సూచించారు. 

సమావేశంలో రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్, రిజిస్ట్రా ఆచార్య కె. రాంబాబు, చీఫ్ వార్డెన్లు, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్, అసోసియేటెడ్ డీన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...