విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ముగిసిన రిలే నిరాహార దీక్షలు..* *శ్రీ కె. కె రాజు గారు ఆధ్వర్యంలో మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విద్యార్థులు, యువత, నాయకులు...*
సత్యం జంక్షన్ వద్ద DSC లో జరిగిన అక్రమాలు పై లోకేష్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తు మానవహారం నిర్వహించిన వైసీపీ శ్రేణులు...*
విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలతో పాటు డీఎస్సీ అక్రమాలపై వైసీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు* ఆధ్వర్యంలో సత్యం జంక్షన్ వద్ద ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి
ఈ రోజు 47,48,49,50 51,52,53,54,55, వార్డు నాయకుల చేపట్టిన రిలే నిరాహార దీక్షలును శ్రీ కె. కె రాజు గారు ప్రారంభించారు...
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలతో పాటు నిరుద్యోగ భృతి, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ.9500 కోట్లు చెల్లించాలన్న డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని చెప్పారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని అన్నారు . ఈ ప్రభుత్వంలో ప్రశ్నించడమే నేరం అనే విధంగా అరెస్టులు, అక్రమ కేసులుపెడుతున్నారని, ఇలాంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు అని అన్నారు అధికార, పోలీస్ బలంతో తమ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.అధికార పార్టీ నేతలు చెప్పినట్లు పోలీసులు నడుచుకోవద్దని కోరారు. అక్రమ అరెస్టులు, కేసులు పెడితే తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.
ఈరోజు దీక్ష చేపట్టిన అల్లుశంకర్ రావు, రేయ్యివెంకటరమణ,వావిలపల్లి ప్రసాద్ భర్కట్ ఆలీ, గుజ్జు వెంకట్ రెడ్డి, సుకుమార్,డోప్ప శ్రీను,ఐ.రవికుమార్, వేణు ధమయంతి,ఎరం శెట్టి శ్రీను,కె వి బాబా షేక్ బాబ్జి, పి. ఈశ్వరి, చందు,కోరిబిల్లి చందు, తాటిపూడి రత్నం,సొండి సురేష్, శివరాం,విమల్ లకు నిమ్మరసం ఇచ్చి కె. కె. రాజు గారు.మూడవ రోజు దీక్ష విరమీoప చేశారు.
అనంతరం సత్యం జంక్షన్ వద్ద DSC లో జరిగిన అక్రమాలు పై లోకేష్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తు విద్యార్థులు, యువత,వైసీపీ శ్రేణులు తో కలిసి భారీగా మానవహారం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు,విద్యార్థులు,మేధావులు మరియు మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, నియోజకవర్గ పరిశీలకులు ,బాణాల శ్రీనివాసరావు, పెడాడ రమణి కుమారి,ప్రచార విభాగం జోన్ -1 ప్రెసిడెంట్ రవిరాజు,మాజీ కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు, పద్మరెడ్డి,కె వి ఎన్ శశికళ,పామెటీ బాబ్జి,వార్డు అధ్యక్షులు బొడేటి కిరణ్, రాష్ట్ర, జోనల్,జిల్లా,నియోజకవర్గ నాయకులు దేముడుబాబు మాస్టర్,కిరణ్ రాజు, తాడిజగన్నాధరెడ్డి,దుప్పలపూడి శ్రీనివాస్ అంబటి శైలేష్ యం.సునీల్, బయవరపు రాధా ,తిరుమలరావు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు,వార్డు పరిశీలకులు మరియు 47,48,49,50,51,53,54,55 వార్డుల సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు,వార్డు వైస్ ప్రెసిడెంట్,మహిళలు, సచివాలయం అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు,మహిళలు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




Comments
Post a Comment