Skip to main content

కమర్షియల్ సోలార్ వినియోగదారులపై టీఓడీ భారం ఆంధ్ర ప్రదేశ్ సోలార్ ఇంటెగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి విశ్వప్రసాద్


విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని కమర్షియల్ సోలార్ వినియోగదారులపై టీఓడీ (టైం అఫ్ డే) టారిఫ్ విధానాన్ని వర్తింపజేయడం వల్ల వారు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆంధ్ర ప్రదేశ్ సోలార్ ఇంటెగ్రేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి విశ్వప్రసాద్ తెలిపారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని , సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు (పీక్ హవర్స్ ) సోలార్ ఉత్పత్తి ఉండదన్నారు. వ్యాపారులు  ఈ సమయంలో గ్రిడ్ విద్యుత్‌ను వాడాల్సి వస్తుందని, దీనికి ప్రభుత్వం భారీగా టీఓడీ ఛార్జీలు వసూలు చేస్తోందన్నారు. పగలు ఉత్పత్తి అయ్యే సౌరశక్తి మిగులుకు గ్రిడ్‌కు ఇచ్చే విద్యుత్ విలువ తక్కువగా ఉండి, రాత్రి వేళల్లో వారు గ్రిడ్ నుండి తీసుకునే విద్యుత్ విలువ (టీఓడీ ఛార్జీల వల్ల) ఎక్కువగా ఉంటుందని, దీనివలన టీఓడీ బిల్లింగ్ విధానంలో పీక్ హవర్స్ లో సర్దుబాటు  జరగకపోవటం వలన నెట్ మీటరింగ్ సదుపాయం ఉన్నప్పటికీ బిల్లులు ఆశించినంతగా తగ్గవన్నారు. 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో  కమర్షియల్ సోలార్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలే ప్రధాన కారణమన్నారు. ఏపీ విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం కమర్షియల్ కేటగిరీకి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పీక్ అవర్స్‌గా పరిగణిస్తారని,ఈ 4 గంటల సమయంలో కమర్షియల్ వినియోగదారులు వాడే విద్యుత్‌పై సాధారణ రేటు కంటే యూనిట్‌కు 1.00 నుండి 2.00 వరకు అదనపు టీఓడీ (టీఓడీ) పెనాల్టీ ఛార్జ్ పడుతోందన్నారు.ఈ సమయంలో సోలార్ ఉత్పత్తి సున్నా కాబట్టి, వారు పూర్తిగా గ్రిడ్ విద్యుత్‌పైనే ఆధారపడి భారీ బిల్లులు కట్టాల్సి వస్తోందని విశ్వ ప్రసాద్ తెలిపారు.విద్యుత్ ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం ప్రతిష్ట్మాత్మకంగా అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా సౌరశక్తికి పెద్దపీటవేసిందని, రాష్ట్ర ప్రభుత్వం దానిని గౌరవించేవిధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కమర్షియల్ సోలార్ వినియోగదారులకు ToD నుండి మినహాయింపు ఇచ్చి, ఏ బిల్లింగ్ సైకిల్ లో ఉత్పత్తి అయిన సోలార్ యూనిట్లు అదే బిల్లింగ్ సైకిల్ లో సర్దుబాటు చేస్తే సమస్య పరిస్కారమవుతుందని  అనేక మంది నిపుణులు చెబుతున్నారన్నారు.పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా జీరో విద్యుత్ బిల్లులు వస్తాయని ప్రకటనలు ఇస్తున్నారని వాస్తవానికి విద్యుత్ నియంత్రణ మండలి అమలు చేస్తున్న నిబంధనలతో విద్యుత్ బిల్లు తగ్గాక పోగా ఎక్కువ బిల్లు వస్తున్నాయన్నారు. నెట్ మీటర్ ఏర్పాటులో జాప్యం, డిస్కం బిల్లింగ్ లోపాలు, తప్పుగా లెక్కించడం, సోలార్ సామర్థ్యం సరిపోకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.ఈ విషయంపై అవగాహన లేని వినియోగదారులు విక్రేతదారులను (వెండర్) లను తప్పుపడుతున్నారన్నారు. త్వరలోనే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిసి తమ సమస్యలను వివరిస్తామని తెలిపారు. సోలార్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ సౌరశక్తి రంగానికి తగిన న్యాయం చెయ్యాలని విశ్వప్రసాద్ కోరారు.

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...

శ్రీవాణి' 500వ సంచిక చారిత్రాత్మక వేడుకలకు విచ్చేసిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి ఘన స్వాగతం

విజయవాడ:విశాఖ సందేశం వర్తవాహని: ఆగస్టు 7: నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, సాహిత్య సేవలను అందిస్తున్న ప్రముఖ మాసపత్రిక 'శ్రీవాణి' 500వ సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొనడానికి విజయవాడకు విచ్చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్. జె. రత్నాకర్ గారికి విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శ్రీ రత్నాకర్ గారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు, 'శ్రీవాణి' సంపాదకులు శ్రీ కొమరగిరి శ్యాంప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ చి.హెచ్.సురేంద్ర జిల్లా అధ్యక్షులు శ్రీ జి. విశ్వనాథం తదితర నిర్వాహకులు, సాయి భక్తులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఆగస్టు 8న విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరగనున్న ఈ చారిత్రాత్మక 500వ సంచిక వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

భక్తి.. సాహిత్యం.. సేవ.. సమన్వయంగా ‘కవిం కవీనామ్‌’ — ఏలూరు జిల్లా భక్తుల పార్థి యాత్రలో హృదయాలను హత్తుకున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రశాంతి నిలయం:విశాఖ సందేశం వర్తవాహని:ఆగస్టు 9, 2026:ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా భక్తులు చేపట్టిన రెండు రోజుల పార్థి యాత్ర రెండవ రోజు, ఆగస్టు 9న, ప్రశాంతి నిలయంలో భక్తి, కృతజ్ఞత, సేవా భావాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పట్ల తమ అపారమైన ప్రేమ, భక్తి, కృతజ్ఞతలకు ప్రతీకగా భక్తులు శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ పవిత్రమైన 108 నామాలను సామూహికంగా జపిస్తూ, స్వామివారి చిత్రపటానికి పవిత్ర అక్షతలను సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. రైతులకు అండగా ‘సేవ’*రెండవ రోజు ఉదయం గ్రామీణ కుటుంబాల సాధికారత లక్ష్యంగా చేపట్టిన ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సభ్యులైన 39 మంది ఆర్థికంగా వెనుకబడిన రైతులకు వ్యవసాయ కార్యకలాపాల్లో ఉపయోగపడే అధునాతన బ్యాటరీ ఆధారిత పవర్ స్ప్రేయర్లను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రసాదంగా అందజేశారు. ఈ వ్యవసాయ పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ అర్హులైన లబ్ధిదారులకు...