Skip to main content

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం, సింహాచలం. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న ఐఏఎస్ అధికారి శ్రీమతి ఎస్. ఎస్. శోభిక, దంపతులు.

 


సింహాచలం, 03 ఆగస్టు 2026: గిరిజన సహకార సంస్థ (GCC), విశాఖపట్నం వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎస్. ఎస్. శోభిక, ఐఏఎస్ గారు కుటుంబ సభ్యులతో కలిసి నేడు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.


ఈ సందర్భంగా ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె. తిరుమలేశ్వరావు  వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీమతి శోభిక దంపతులు మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తదుపరి స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

దర్శనానంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి, శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

                    K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

*శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా* *ప్రేమ సేవగా తలవంచిన వేళ — గిరి ప్రదక్షిణ భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కల్పించిన శ్రీ సత్యసాయి సేవాదళ్- గిరి ప్రదక్షిణ మార్గంలో వేలాది మంది భక్తులకు ప్రేమతో, నిస్వార్థంగా సేవలందించిన విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు*

విశాఖపట్నం :29 జులై 2026: పవిత్రమైన గురుపూర్ణిమ సందర్భంగా సింహాచల క్షేత్ర ఆరాధ్యదైవం, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విస్తృతమైన సేవా కార్యక్రమాలను ప్రేమతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాయి. విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల సింహాచలం సమితి, గోపాలపట్నం భజన మండలి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు 28 జులై 2026 ఉదయం నుంచే సేవా కార్యక్రమాలు ప్రారంభమై, రాత్రంతా కొనసాగి 29 జులై 2026 ఉదయం 7 గంటల వరకు నిర్వహించబడ్డాయి. *అలసిన భక్తుల పాదాలకు ప్రేమతో ఉపశమనం — ప్రత్యేక సేవ* గిరి ప్రదక్షిణలో ఎంతో దూరం నడిచి అలసిపోయిన భక్తుల పాదాలకు ఉపశమనం కల్పించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రత్యేక పాద మర్దన సేవ అందరి హృదయాలను స్పృశించింది. భక్తుల అలసిన పాదాలకు ఉపశమనం కలిగించేందుకు నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలను మరిగించి తయారుచేసిన నూనెను శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేకంగా సిద్ధం చేయించాయి. శ్రీ సత్యసాయి మహిళా మరియు పురుష సేవాదళ్ సభ్యులు స్వయంగా భక్...