సత్య సాయి విద్యా విహార్- విశాఖపట్నం* (శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆధ్వర్యంలో) బాహ్య స్వాతంత్ర్యం నుంచి అంతర స్వాతంత్ర్యం వైపు విశాఖపట్నం :స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్- ఆగస్టు 15, 16 తేదీల్లో శ్రీ సత్యసాయి విద్యావిహార్లో రెండు రోజుల ప్రదర్శన–సాంస్కృతిక కార్యక్రమాలు
విశాఖపట్నంభగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సత్యసాయి విద్యావిహార్, విశాఖపట్నం, విద్యా రంగంలో, విద్యతో పాటు ఇతర కార్యక్రమాల్లో, అలాగే విలువలతో కూడిన సమగ్ర విద్యను అందించడంలో విశిష్టతను కొనసాగిస్తోంది.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత వర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా మరియు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి నేషనల్ కౌన్సిల్ ఫర్ స్కూల్స్, ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా, “స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ – స్వాతంత్ర్య స్ఫూర్తి” అనే ఇతివృత్తంతో ఆగస్టు 15, 16 తేదీల్లో పాఠశాల ప్రాంగణంలో ద్విదిన ప్రదర్శన–సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆగస్టు 15న జరిగే ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీ ఎం. శ్రీభరత్ గారు, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు, విశాఖపట్నం మరియు గీతం డీమ్డ్ టు బీ యూనివర్సిటీ అధ్యక్షులు హాజరుకానున్నారు. 16 ఆగష్టు న జరిగే
వాలెడిక్టరీ కార్యక్రమానికి డా. జితేంద్ర శర్మ గారు, మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఫౌండర్ సీఈఓ, ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ (AMTZ) గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.
శ్రీ సత్యసాయి నేషనల్ కౌన్సిల్ ఫర్ స్కూల్స్, ఇండియా కన్వీనర్ శ్రీ త్రిభువన్ సచ్దేవ గారు రెండు రోజుల కార్యక్రమాలకు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.
*ఎగ్జిబిషన్ను ఆగస్టు 15వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు*, అలాగే *ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు* ఈ చిన్నారులు ఎంతో శ్రద్ధతో రూపొందించిన అద్భుతమైన ఎగ్జిబిషన్ను సందర్శించవచ్చు.
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment