బ్రాహ్మణ సమాజ అభ్యున్నతి, ఐక్యతకు సమిష్టి కృషి .విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం సర్వసభ్య సమావేశంలో పిలుపు*
విశాఖపట్నం :విశాఖపట్నం సందేశ్వ:ర్తవాహని:బ్రాహ్మణుల ఉనికిని కాపాడుకోవడానికి, సమాజ పురోభివృద్ధికి బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం పిలుపునిచ్చింది. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు నెమ్మలూరి శివ గణేష్ శర్మ అధ్యక్షతన పెందుర్తి, వేపగుంట తదితర ప్రాంతాల బ్రాహ్మణ సభ్యులతో శనివారం ముఖ్యమైన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ మాజీ కేంద్ర అధ్యక్షుడు సుసరాపు చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘ సభ్యులు ఘన నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో సంఘ పురోభివృద్ధిలో భాగంగా పెందుర్తి, వేపగుంట పరిసర ప్రాంతాలకు ఏరియా కోఆర్డినేటర్లను నియమించేందుకు సలహాలు, సూచనలు సేకరించారు. బ్రాహ్మణుల ఉనికిని రక్షించుకోవడానికి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. బ్రాహ్మణ సంఘాల ఐక్యత ఆవశ్యకతను నేతలు వివరించారు.ఈ సర్వసభ్య సమావేశంలో సంఘ కేంద్ర అధ్యక్షుడు సూర్య ప్రకాష్, ప్రధాన కార్యదర్శి అయిలూరి నాగ కామేశ్వర శాస్త్రి, కోశాధికారి బాదంపూడి కైలాసపతి, జిల్లా అధ్యక్షులు కిషోర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సోమయాజుల విజయకుమార్, ముఖ్య సలహాదారులు చామర్తి కేశవాచార్యులు పాల్గొన్నారు. జేఏసీ ముఖ్య సలహాదారు సుసర్ల హరి, మీడియా కోఆర్డినేటర్లు ఉదయ్ కుమార్, రాజేష్ శర్మ శ్రీకాంత్ శర్మ తదితర కార్యవర్గ సభ్యులు హాజరై, సంఘ బలోపేతానికి విలువైన సలహాలు, సూచనలు చేశారు

Comments
Post a Comment